తండాల పంచాయతీ భవనాలకు రూ.600 కోట్లు
హైదరాబాద్, మార్చి 7 : ఆదివాసీ, గిరిజన తండాలు, గూడాలకు ప్రత్యేకంగా రోడ్లు వేసేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి వీటిని ఖర్చుచేస్తామని ప్రతిపాదించింది. దీనివల్ల రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన గూడేలకు రహదారులు ఏర్పడనున్నాయి. అటు.. గ్రామ పంచాయతీలుగా మారిన తండాల్లో కొత్త పంచాయతీ భవనాలను నిర్మించడానికి, ఒక్కో గ్రామపంచాయతీ భవనానికి రూ.25 లక్షల చొప్పున 2,400 భవనాలకు రూ.600 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, మరో రూ.300 కోట్లు ఉపాధి హామీ కింద ఖర్చు చేయనున్నది.