మహదేవపూర్, జూలై 5: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ బరాజ్కు భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బరాజ్కు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి నీటి ప్రవాహం భారీగా పెరిగింది. బరాజ్ పూర్తి నిల్వ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.8 టీఎంసీల నీరు ఉన్నది. మంగళవారం 60,530 క్యూసెక్కులకు వరద వస్తుండగా, అవుట్ఫ్లో 69,940 క్యూసెక్కులుగా నమోదైంది. బరాజ్ 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.