హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా గుడిమలాపూర్, నానల్నగర్లోని 5,262 చదరపు గజాల పత్రాలను పరిశీలించకుండా ఎన్వోసీ జారీచేసిన పూర్వపు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్పై శాఖాపర విచారణను 6 వారాల్లోగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. విచారణ త్వరగా పూర్తి చేయాలని సీజే అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం గురువారం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ముగ్గురు నిందితులకు సమన్లు జారీ చేసి విచారణ సత్వరమే పూర్తి చేయాలని కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31వ తేదీనాటికి విచారణ పూర్తి చేయాలంది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. తనకు చెందిన స్థలాన్ని ముగ్గురు వ్యక్తులకు ఎన్వోసీ ఇచ్చారంటూ శాంతి అగర్వాల్ 2011లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.