డీడీఎన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ
కమాన్చౌరస్తా, ఆగస్టు 8 : సీఎం కేసీఆర్ కృషి వల్లే రూ. 2500 వచ్చే ధూపదీప నైవేద్య అర్చక వేతనం రూ.ఆరు వేలకు పెరిగిందని ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ స్పష్టంచేశారు. ఆ వేతనాన్ని పెంచి అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం తృతీయ వార్షికోత్సవ ఆత్మీయ సదస్సును నిర్వహించారు. బ్రాహ్మణ సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపి, ఆశీర్వాదం అందజేశారు. అనంతరం వాసుదేవశర్మ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.6 వేల జీతం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం కనీస వేతన స్థాయిని కల్పించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో సంఘం నేతలు తిరునగరి వేంకటాద్రిస్వామి, నాగదక్షిణామూర్తి, శ్యాంసుందర్, శివ ప్రసాద్,ఆంజనేయశర్మ పాల్గొన్నారు.