Coronavirus | హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 19 యాక్టివ్గా ఉన్నాయి. ఒకరు రికవరీ అయ్యారు. తాజాగా నమోదైన ఆరు కేసుల్లో హైదరాబాద్ నుంచి నాలుగు, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదు అయ్యాయి. తెలంగాణలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది.
కరోనా కేసులు అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో పదేండ్ల లోపు చిన్నారులు, 60 ఏండ్లు పైబడ్డ వారు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా తమ నివాసాల నుంచి బయటకు రాకూడదని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆదేశించింది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే తక్షణమే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది.