శంషాబాద్ రూరల్, జనవరి 12 : శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.6 కోట్ల విలువైన వజ్రాలను శుక్రవారం డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు వజ్రాలను చాక్లెట్ పేపర్లలో చుట్టుకొని వచ్చినట్టు డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ వజ్రాల విలువ రూ.6 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.