నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఒకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, అప్తమాలజీ విభాగాలలో సర్జరీలు చేయడం ప్రభుత్వ హాస్పిటల్స్ మెరుగైన పనితీరుకు అద్దం పడుతుందన్నారు.
వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ఇదే నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
అందులో భాగంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా అన్ని రకాల అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చారని మంత్రి గుర్తు చేశారు. 59 ఆపరేషన్లు చేసి రికార్డు నెలకొల్పిన ఆయా విభాగాల అధిపతులను, డాక్టర్లను, దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఒకే రోజు 59 శస్త్ర చికిత్సలు చేసిన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు💐
సీఎం శ్రీ కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో మారుమూల జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువయ్యాయి. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుకు ఇది గొప్ప నిదర్శనం. pic.twitter.com/c0xFSgoFm7— Harish Rao Thanneeru (@trsharish) August 27, 2022