హైదరాబాద్ : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని టీఎస్ ఆర్టీసీ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్ నుంచి 59 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. శ్రీశైలం దేవాలయానికే కాకుండా.. వేములవాడ, కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడలకు కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 4వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడ ప్రాంతాలకు ఈ బస్సులను నడపనున్నారు. 30 మందితో కూడిన భక్తులు గ్రూపుగా ఏర్పడితే ప్రత్యేక బస్సును కేటాయిస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సు నివాస ప్రాంతాలకే వెళ్లనుంది.