హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ సంచలన నిర్ణయం తీసుకున్నది. కమిషన్ ప్రధాన కమిషనర్ బుద్ధా మురళి 545 సమాచార హక్కు (ఆర్టీఐ) పిటిషన్లకు కలిపి ఒకే ఆర్డర్ ఇచ్చారు. శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి 545 పిటిషన్లు దా ఖలు చేశారు. ఇవన్నీ ఆర్థికశాఖకు చెందినవే. అందుకే అన్నింటికీ కలిపి ఒకే ఆర్డర్ ఇచ్చినట్టు బుద్ధా మురళి తెలిపారు. కొంతమంది వివిధ కారణాలతో ఎక్కువ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని చెప్పారు. ఒక్కో వ్యక్తి వందల సంఖ్యలో పిటిషన్ చేస్తున్న సందర్భాలూ ఉన్నాయన్నారు. దీనివల్ల యంత్రాంగం సమయం వృథా అవుతున్నదని, కమిషన్పై భారం పడుతున్నదని, కొంతమంది నిజమైన పిటిషనర్లకు సమాచారం ఆలస్యం అవుతున్నదని తెలిపారు.