హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.5200 కోట్లు కేటా యించాలని ఆ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించేందుకు టీఎస్ ఐపాస్ చట్టాన్ని ప్రవేశపెట్టడంతోపాటు పెద్ద ఎత్తున రాయితీలు కల్పించింది. ఆయా రాయితీలను మరింతగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతం ఇస్తున్న రాయితీలను మరింత పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు అధికారవర్గాల సమాచారం.