హైదరాబాద్: హైదరాబాదీ మహిళలు లావెక్కుతున్నారు. నగరానికి చెందిన సుమారు 51 శాతం మంది మహిళల్లో ఊబకాయలు ఉన్నట్లు కౌన్సిల్ ఫర్ సోషల్ డెవపల్మెంట్ నివేదిక చెప్పింది. దాదాపు సిటీ మహిళలు అధిక బరువుతో లేదా ఊబకాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 30.1 శాతం మహిళలు బరువు సమస్యతతో ఉన్నట్లు సీఎస్డీ రిపోర్ట్ పేర్కొన్నది. తెలంగాణ ప్లానింగ్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన నివేదికను తయారు చేసింది.
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అతి తక్కువ సంఖ్య ఊభకాయ మహిళలు ఉన్నట్లు తేలింది. ఆ రాష్ట్రంలో కేవలం 14.0 శాతం మహిళలు మాత్రమే ఆ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. 2019-20కి సంబంధించిన డేటా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 18.8 శాతం మంది మహిళల్లో బీఎంఐ స్థాయి నార్మల్ కన్నా తక్కువగా ఉన్నట్లు తేల్చారు. హైదరాబాద్ బీఎంఐ లెవల్ తక్కువగా ఉన్న వారి సంఖ్య 12.4 శాతంగా ఉంది. గద్వాల్ జిల్లాలో అత్యధికంగా 27 శాతంగా ఉంది.
తెలంగాణలో అత్యధిక మహిళా అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లాలో హైదరాబాద్ టాప్ ప్లేస్లో నిలిచింది. తెలంగాణ వ్యాప్తంగా 66.6 శాతం మహిళలు అక్షరాస్యులున్నారు. గద్వాల్ జిల్లాలో మహిళా అక్షరాస్యత 45 శాతం మాత్రమే ఉంది. ఇక వనపర్తి జిల్లాలో గర్భిణులు వంద శాతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. 96.7 శాతం మహిళలు ఎంసీపీ కార్డు పొందినట్లు తెలుస్తోంది.
2019-2000 సీజన్లో తెలంగాణలో 60 శాతం సిజేరియన్ పద్ధతిలో ప్రసవాలు జరిగాయి. సిజేరియన్ లెక్కల్లో కరీంనగర్ ఫస్ట్ ఉంది. అక్కడ 82.4 శాతం సిజేరియన్ కేసులు నమోదు అవుతున్నాయి. 27.2 శాతంతో కుమురం భీమ్ చివరి స్థానంలో ఉంది.