హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణలో ఉపముఖ్యమంత్రి పదవితోపాటు ఐదు మంత్రి పదవులను బీసీలకే ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. త్వరలో భర్తీ చేయబోయే కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చైర్మన్లు, డైరెక్టర్లు, మారెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు జనాభా ప్రకారం 50 శాతం పదవులివ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్లో బీసీలకు 20 వేల కోట్లు కేటాయించాలని, బీసీబంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి బీసీ కుటుంబానికి రూ.20 లక్షలు మంజూరు చేయాలని కోరారు.