కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా ఆదివారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 13822.07 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ఉదయం వరకు 3 గేట్ల ద్వారా కొనసాగగా సాయంత్రం ఇన్ఫ్లో పెరగడంతో 5 గేట్ల ద్వారా నీటిని బయటకు పంపారు.
ప్రాజెక్టు గేట్ల ద్వారా 12229.35 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.కాలువలకు 139.32 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 641.82 అడుగులు(3.65 టీఎంసీలు)గా ఉంది.