న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి, విధ్వంసం చేసిన కేసులో ఐదుగురు హిందూసేన కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని న్యూఢిల్లీ డీసీపీ దీపక్ యాదవ్ చెప్పారు.
మంగళవారం సాయంత్రం అసదుద్దీన్ ఓవైసీ ఇంటిలోకి చొచ్చుకుని వచ్చిన హిందూసేన కార్యకర్తలు ఆ ఇంటి తలుపు, నేమ్ ప్లేట్, ఇంటి బయట అద్దాలు పగుల గొట్టారు. ఓవైసీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందున తమ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని హిందూసేన అధినేత విష్ణు గుప్తా తెలిపారు.