మెదక్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టడంతో ముగ్గురు ఎంఎల్ఎస్ పా యింట్ ఇన్చార్జిలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మెదక్ జిలాల్లోని మెదక్, రామాయంపేట, చేగుంట ఎంఎల్ఎస్ పాయింట్లలో వారం రోజుల క్రితం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఇందులో రెండేండ్లుగా జరుగుతున్న అవినీతి వ్యవహారం బయటపడింది. రేషన్ షాపులకు పంపే పీడీఎస్, సన్న బియ్యం సరఫరాలో ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు కక్కుర్తి పడుతున్నట్టు తెలిసింది. దీంతో కోట్లు విలువ చేసే పీడీఎస్ బియ్యం, సన్న బియ్యం పక్కదారి పడుతున్నది. సుమారు రూ.5.41 కోట్ల విలువైన పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టగా, మెదక్, రామాయంపేట, చేగుంట ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జీలను సస్పెండ్ చేశారు.