హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని భద్రతా శిబిరాల వద్ద ఇంటర్నెట్ సేవల అప్గ్రెడేషన్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,343 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఫేజ్-1లో మొబైల్ సేవలను 2జీ నుంచి 4జీకి మార్చనున్నారు. ఇందుకోసం రూ.1,884 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. పనులు బీఎస్ఎన్ఎల్కు అప్పగించారు. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లో భద్రతా సిబ్బందికి తగిన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అయితే, తెలంగాణలో ఎన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నది కేంద్రం వెల్లడించలేదు.