హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,976 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,646 మంది బాధితులు కోలుకున్నారు. 35 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 4,97,361 చేరాయి. యాక్టివ్ కేసులు 65,757కు పెరిగాయి. ఇవాళ్టి వరకు 2739 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 55,358 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.