హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : రెండుమూడు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం 494 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. పాజిటివిటీ రేటు 1.5 శాతానికి తగ్గింది. మరోవైపు రెట్టింపు రికవరీలు నమోదయ్యాయి. ఒక్కరోజే 1,054 మంది రోగులు కోలుకున్నట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఐదువేల యాక్టివ్ కేసులు ఉన్నట్టు పేర్కొన్నది. అత్యధికంగా హైదరాబాద్లో 223, రంగారెడ్డిలో 34, మేడ్చల్ మల్కాజిగిరిలో 36 కేసులు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 1.26 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 1.16 లక్షలు ప్రికాషన్ డోసులే కావడం గమనార్హం.