హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 477 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. 279 మంది రోగులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.83 శాతంగా నమోదైంది. రికవరీ రేటు 99శాతం దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 3,960 యాక్టివ్ కేసులున్నాయి. హైదరాబాద్లో 258, రంగారెడ్డిలో 107, మేడ్చల్ మల్కాజిగిరిలో 56 కేసులు వెలుగు చూశాయి.