హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): గతేడాది తొలి కేసు నమోదైన సమయంలో చికిత్స, ఔషధాలు, నివారణామార్గాలపై ఏ ఒక్కరికీ అవగాహన లేదు. ఏడాదిపాటు కొనసాగిన తొలివేవ్ ప్రపంచవ్యాప్తంగా అనేక గుణపాఠాలు నేర్పింది. ఈ క్రమంలో రాష్ట్రంలో వైరస్ను ఎదుర్కొనేందుకు చేసుకున్న ఏర్పాట్లు, కల్పించుకున్న మౌలిక సదుపాయాలు సెకండ్వేవ్ను ఎదుర్కోవడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రం లో గతేడాది పడకల కొరత లేకుండా చేసుకున్న ముందస్తుచర్యలు సెకండ్వేవ్ సమయంలో పేషెంట్లకు చికిత్స అందించేందుకు అందుబాటులో ఉంటున్నాయి. ప్రైవేటు దవాఖానలకు కొవిడ్ చికిత్స చేసేందుకు అనుమతివ్వడంతో 50 వేల పడకలు సిద్ధంగా ఉన్నా యి. దీనికి అదనంగా ఏర్పాటవుతున్న కొవిడ్కేర్ సెంటర్లు కరోనా పాజిటివ్స్కు ఉపయుక్తంగా ఉంటున్నాయి. హైదరాబాద్సహా అన్నిజిల్లాల్లో కలిపి ప్రభుత్వం 4,737 కొవిడ్ కేర్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందులో మూడుపూటలా భోజనం, పౌష్టికాహారం అందించడంతోపాటు మందులను సరఫరా చేస్తున్నారు. పదిరోజులపాటు ఇక్కడేఉన్నాక ఇంటికి పంపుతున్నారు. అవసర మైతే పెద్దాసుపత్రులకు పంపుతున్నారు.
పెద్దసంఖ్యలో ఖాళీ పడకలు
ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో మొత్తం 50వేలకుపైగా పడకలు ఉన్నాయి. ఇందులో ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రభు త్వ దవాఖానల్లో 13,732 బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 3,703 పడకలు భర్తీకాగా, 10,029 ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటులో 30,816 పడకలు ఉండగా 10,919 భర్తీకాగా, 19,897 ఖాళీగా ఉన్నాయి. పడకల సంఖ్యను 60 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్ చికిత్స అందించే ప్రభుత్వ దవాఖానలు