Telangana Budget | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సీఎం కేసీఆర్ నిధులను పెంచారు. గత బడ్జెట్లో ఈ పథకాలకు రూ. 2,750 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో రూ. 3,210 కోట్లు కేటాయించారు. బీసీలకు రూ. 2 వేల కోట్లు, ఎస్సీలకు రూ. 500 కోట్లు, మైనార్టీలకు రూ. 450 కోట్లు, గిరిజనులకు రూ. 260 కోట్లు కేటాయించారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద కులమతాలకు అతీతంగా పేదింటి ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 1,00,116 ఆర్థిక సాయం అందిస్తున్నది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షల 469 మంది ఆడపిల్లలకు రూ. 10,416 కోట్లు సాయం చేయడం జరిగిందన్నారు. 18 ఏండ్లు నిండి ఆడపిల్లలకే ఈ పథకం వర్తిస్తుండటంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయి.