రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం ఆత్మబంధువైంది. అద్భుత సంక్షేమ పథకాల అమలుతో అన్నదాతల్లో భరోసా నింపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే కనీవినీ ఎరుగనిరీతిలో అండగా నిలిచింది. రైతుబంధుతో పెట్టుబడి సాయం అందించింది. రైతు బీమా, రుణమాఫీతో కర్షకుల సంక్షేమ ప్రభుత్వంగా మారింది. వ్యవసాయం దండగ అన్న రోజుల నుంచి ప్రస్తుతం సాగును పండుగగా మార్చింది.
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తేతెలంగాణ): సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కన్నీటిని తుడిచారు. వ్యవసాయ యాంత్రీకరణ, పంటల కొనుగోళ్లు, వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలపై ఉన్న పన్ను రద్దు చేశారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించడంలో భాగంగా పాలీహౌజ్లకు సబ్సిడీ అందించడంతోపాటు సూక్ష్మసేద్యాన్ని అమలుచేశారు. శుక్రవారం అసెంబ్లీలో సంక్షేమరంగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల వివరాలను సీఎం కేసీఆర్ సభ్యులకు వివరించారు. ఆ వివరాలు ఇలా..
ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్లలో ఖర్చు పెట్టిన మొత్తం 7,994 కోట్లు
స్వరాష్ట్రంలో ఏడేండ్లలో ఖర్చు పెట్టిన మొత్తం75,064కోట్లు
రుణమాఫీ
2014లో 35.32 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.16,876 కోట్ల రుణాలను మాఫీ చేసింది.
తొలి విడత 3 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.25 వేల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేసింది.
మలి విడత 6 లక్షల మంది రైతులకు చెందిన రూ.50 వేల వరకు ఉన్న రుణాలు మాఫీ చేసింది.
2018లో 4.07 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.733 కోట్లు జమచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో రూ. కోట్లలో..