సంగారెడ్డి: జిల్లాలోని ముత్తంగి గురుకుల స్కూల్లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. పాఠశాలలో 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ అయింది. స్కూల్లో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. ఆదివారం 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మిగిలినవారికి కూడా వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చినవారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. పాజిటివ్ వచ్చినవారిని హాస్టల్లోనే క్వారంటైన్లో ఉంచామని, వారందరికి వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.