హుజూరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హాట్టాపిక్గా మారిన హుజూరాబాద్ (Huzurabad) ఉపఎన్నిక బరిలో మొత్తం 42 మంది నిలిచారు. మొత్తం 61 మంది ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు. వీటిలో 19 నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్లు ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
నామినేషన్ తిరస్కరణకు గురైన వారిలో ఏఐఎంఐఎం అభ్యర్థి తామిర్ కమల్ ఖుంద్మీరి కూడా ఉన్నారు. నామినేషన్ స్వీకరించిన వారిలో 31 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి వెంకట నర్సింగ రావు బాల్మూర్ పోటీ పడుతున్నారు.