హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు రెండు వేర్వేరు ఉత్తర్వులను విడుదల చేశారు. రూ.39 కోట్లు విడుదల చేస్తూ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో)ను విడుదల చేయగా, కోటి రూపాయ మరో బీఆర్వోను రామకృష్ణారావు విడుదల చేశారు.