గజ్వేల్, జూన్ 3: ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆర్థికసాయం అందజేసి అండగా నిలిచా రు. ఈ మేరకు బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ మండలం కోమటిబండకు చెందిన షేక్ భాస్కర్, జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఎం సుమన్గౌడ్, ములుగు మాజీ ఎంపీటీసీ బొడ్డు ప్రవీణ్, మర్కూక్ మండలం కాశిరెడ్డిపల్లి సీనియర్ నాయకుడు బండారి ఎ ల్లయ్య కుటుంబ సభ్యుల ఒక్కొక్కరికి లక్ష చొప్పున మొత్తం నాలుగు లక్షల ఎఫ్డీ బాండ్లను అందజేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటే రు ప్రతాప్రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, తదితరులు పాల్గొన్నారు.