నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరదప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి వేశారు. ప్రాజెక్టులోకి 74,699 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులు. సాగర్ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. 311.7462 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
మూసీ ప్రాజెక్ట్కు భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు నాలుగు గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15193.07 క్యూసెక్కుల వరద వస్తుండగా, 15424.57 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులకుగాను 638.40 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు. ప్రస్తుతం 2.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.