హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖ పరిధిలోని మండల రిసోర్స్ సెంటర్ (ఎంఆర్సీ), క్లస్టర్ రిసోర్స్ సెంటర్ల(సీఆర్సీ)కు మొత్తం రూ.4,81,93,500 గ్రాంట్స్ను సమగ్రశిక్ష అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు.
రాష్ట్రంలో 467 ఎంఆర్సీలకు ఒక్కో ఎంఆర్సీకి రూ.39 వేల చొప్పున మొత్తం రూ.1,82,13,000, 1,817 సీఆర్సీలకు ఒక్కో సీఆర్సీకి రూ.16,500 చొప్పున రూ. 2,99,80,500 నిధులను విడుదల చేశారు.