లోక్ అదాలత్కు విశేష స్పందన
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో 4,20,626 కేసులు పరిషారమయ్యాయి. వీటిలో 1.40 లక్షల పెండింగ్ కేసులు, 2.78 లక్షల ప్రీలిటిగేషన్ కేసులు ఉన్నాయి. బాధితులకు మొత్తం రూ.266 కోట్ల పరిహారం అందినట్టు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి వెల్లడించారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పీ శ్యాంకోశీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ కే లక్ష్మణ్ సలహాలు, సూచనలతో లోక్ అదాలత్ నిర్వహించినట్టు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 340 లోక్ అదాలత్ బెంచ్లు, రుణ వసూళ్ల ట్రిబ్యునల్లో 2 బెంచ్లు, హైకోర్టులో 2 బెంచ్లు ఏర్పాటు చేసి కేసులను పరిషరించినట్టు వివరించారు. హైకోర్టులో జస్టిస్ కే సుజన, జస్టిస్ నందికొండ నర్సింగరావు నిర్వహించిన లోక్ అదాలత్ బెంచ్లో 182 కేసులు పరిష్కారమయ్యాయని, 1,200 మంది బాధితులు రూ.14.81 కోట్ల పరిహారం పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి శాంతివర్ధని వెల్లడించారు.