హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): పోస్టల్ శాఖ ద్వారా రూ.399కే ప్రమాద బీమా కల్పిస్తున్నట్టు హైదరాబాద్ సౌత్ ఈస్ట్ పోస్టల్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ టీఏవీ శర్మ తెలిపారు. ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 20 నుంచి 24 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు.