హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ బుధవారం రూ.37.77 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో రూ.25 లక్షలు అడ్వకేట్ల సబ్సిడీకి, రూ.2.5 లక్షలు కులాంతర వివాహం చేసుకొన్న జంటలకు ఇచ్చే ప్రోత్సాహకం కోసం, మిగతా వాటిని ప్రభుత్వ హాస్టళ్ల కోసం కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.