హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలకు వైద్య సేవలు చేరువయ్యాయి. ప్రజల ఆరోగ్య సంరక్షణ, వైద్యారోగ్య రంగ అభివృద్ధి లక్ష్యం గా ప్రభుత్వం వైద్య, విద్యారంగంలో విప్లవాత్మకమైన కార్యక్రమాలు, పథకాలను చేపట్టింది. ఫలితంగా తొమ్మిదేండ్లలోనే తెలంగాణ సాధించిన ప్రగతి దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ఇంటికి చేరువగా వైద్యం
గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు ఇంటికి చేరువగా వైద్యం అందించడానికి ప్రభుత్వం బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలకు శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో మొత్తం 434 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రాంతంలో 350 బస్తీదవాఖానాలు సేవలు అందిస్తున్నాయి. ఒక బస్తీ దవాఖాన 5 వేల నుంచి పది వేల జనాభాకు సేవలను అందిస్తున్నది. డాక్టర్ పర్యవేక్షణలో ఇకడ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు అందిస్తున్నారు. గత ఏడాది చివరినాటికి బస్తీ దవాఖానాల్లో 2.11 కోట్ల మంది చికిత్స పొందారు. ప్రభుత్వం సుమారు రూ.95 కోట్లు ఖర్చు చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో మండలానికో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం మాత్రమే ఉండేది. దీంతో పేద ప్రజలు నానా తంటాలు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం మారుమూ ల గ్రామాల్లో సైతం దవాఖానలను ఏ ర్పాటు చేస్తున్నది. ‘హెల్త్ అండ్ వెల్ నెస్ పథకం’ కింద రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలను విసృ్తతంగా అభివృద్ధి చేస్తున్నది. ఇప్పటివరకు 3,206 పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి, 1.36 కోట్ల మందికి వైద్య సేవలు అందించింది. ఒకో పల్లె దవాఖానకు రూ.20 లక్షల వ్యయంతో పకా భవనాలు నిర్మిస్తున్నారు. ప్రతి భవనంలో డాక్టర్ రూంతోపాటు మూడు బెడ్ల తో కూడిన వార్డు రూం, వెయిటింగ్ హాల్, స్టోరేజీ గది, నర్సింగ్ గది, ల్యాబ్ , రెండు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. రోగులను వీల్ చైర్లో తరలించేందుకు ర్యాంప్ కూడా ఉంటుంది.
అండగా తెలంగాణ డయాగ్నస్టిక్స్
ప్రజలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్స్కు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 20 తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ లు సేవలందిస్తున్నాయి. వీటిలో 134 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 11కోట్లకుపైగా ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు ఈ డయాగ్నస్టిక్ హబ్లతో కలిసి పనిచేస్తాయి. ఆటో అనలైజర్లు, డిజిటల్ ఎక్స్-రేలు, అల్ట్రాసౌండ్ సాన్ మెషీన్లు, 2డీ ఎకో, మామోగ్రామ్, హై ఎండ్ డయాగ్నస్టిక్ పరికరాలు ఈ హబ్లో అందుబాటులో ఉ న్నాయి. గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. మరోవైపు కరోనా కంటే ముందు రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ కేవ లం ఒకటి మాత్రమే ఉండేది. ప్రస్తుతం రా ష్ట్రంలో 27 ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు పనిచేస్తున్నాయి.
మానవీయ కార్యక్రమాలు
ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి చికిత్స అందిస్తున్నది. ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది.
ఉచిత డయాలసిస్: కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. దేశంలో తొలిసారిగా సింగి ల్ యూజ్ డయలైజర్, ట్యూబ్లను వినియోగిస్తున్నారు. గత ఏడాది చివరినాటికి 67,049మంది డయాలసిస్ కోసం ప్రభు త్వం రూ.698.08 కోట్లు ఖర్చు చేసింది.
22,455 వైద్య పోస్టుల భర్తీ
వైద్యారోగ్య రంగాన్ని మరింత పటిష్ఠం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా వసతుల కల్పనతో పాటు సిబ్బంది సంఖ్యను పెంచుతున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వం 22,455 పోస్టులను భర్తీ చేసింది. ఇందులో డాక్టర్, నర్సింగ్, పారామెడికల్, ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయి. కొత్తగా మరో 26,978 పోస్టులు మంజూరు చేశారు. భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది.
భరోసా ఇస్తున్న ఆరోగ్యశ్రీ
ఎలాంటి వ్యాధి వచ్చినా ఉచితంగా చికిత్స పొందగలమనే ధైర్యాన్ని ఆరోగ్యశ్రీ పథకం ఇస్తున్నది. ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ పథకంలో ఒకో కుటుంబానికి సంవత్సరానికి గరిష్ట కవరేజీ పరిమితి రూ.5 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది మే వరకు 16 లక్షల మంది ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకున్నారు. ఇందుకోసం రూ.7 వేల కోట్లు ఖర్చు చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ కూడా నగదు రహిత చికిత్స అందిస్తున్నారు. ఈ పథ కం కింద 344 ఎంప్యానెల్డ్ దవాఖానలు ఉన్నాయి , వీటిలో 12,04,654 మంది నమోదు చేసుకున్నారు. మే 2023 వరకు 3,65,200 మంది చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1475.19 ఖర్చు చేసింది.