హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : 202223 విద్యాసంవత్సరానికిగాను మధ్యాహ్న భోజనం పథకానికి రూ.33.92 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు. కోడిగుడ్ల సరఫరా బిల్లులు చెల్లించడానికి ఈ నిధులను రిలీజ్ చేశారు.
వంట చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు మధ్యాహ్న భోజన పథకం కింద వంట చార్జీలను పెంచుతూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో విద్యార్థి లెక్కన బాల వాటిక, ప్రాథమిక పాఠశాలల్లో రూ.4.97 నుంచి రూ.5.45, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ.7.45 నుంచి రూ. 8.17, తొమ్మిది, పది తరగతుల్లో రూ.9.95 నుంచి 10.67 (కోడిగుడ్ల ధర కలుపుకొని)కు పెంచారు. పెంచిన ధరలు 2022 అక్టోబర్ 1 నుంచి అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.