హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం రూ.337.50 కోట్లు విడుదల చేసింది. బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు రూ.20.68 కోట్లు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు రూ.75 కోట్లు, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్కు రూ.121.82 కోట్లు, వైద్యవిధాన పరిషత్తుకు రూ.120 కోట్లు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. డీఎంఈకి విడుదల చేసిన రూ.75 కోట్లను మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వినియోగించనున్నారు. వైద్యవిధాన పరిషత్తుకు ఇచ్చిన నిధుల్లో దవాఖానల అప్గ్రేడేషన్కు రూ.50 కోట్లు, దవాఖానల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.50 కోట్లు, నూతన పరికరాల కొనుగోలుకు రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. డీపీహెచ్కు కేటాయించిన రూ.20.68 కోట్లలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.13.68 కోట్లు, డయాగ్నస్టిక్ యంత్రాల కొనుగోలుకు రూ.5 కోట్లు వినియోగించనున్నారు. ఇక నేషనల్ హెల్త్ మిషన్లో రాష్ట్ర వాటాగా కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్కు రూ.121.82 కోట్లు విడుదల చేశారు.