హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. రాష్ర్టంలో కొత్తగా 3,308 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 21 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 4,723 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుతం 42,959 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇవాళ 63,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 513, ఖమ్మం జిల్లాలో 228, రంగారెడ్డి జిల్లాలో 226, మేడ్చల్ జిల్లాలో 203, కరీంనగర్ జిల్లాలో 161 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) May 22, 2021
(Dated.22.05.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/Z3t8eijVqr