హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళం పథకాన్ని ప్రారంభించింది. ఇందుకు ఒకరోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.33 లక్షల విరాళం ఇవ్వాలని టీటీడీ తెలిపింది. దాతలు స్వయంగా భక్తులకు వడ్డించవచ్చని పేర్కొన్నది. దాతల పేర్లను వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తామని చెప్పింది.