హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో శనివారం రాత్రి వరకు 32,331 పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయినట్లు ఎన్నికల అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హోమ్ ఓటర్ క్యాటగిరీలో మొత్తం 23,247 ఓట్లు ఉండగా 15,637 ఓట్లు పోల్ అ యినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధు ల్లో ఉన్న , సైన్యంలో పనిచేస్తున్న ఉద్యోగులు కలుపుకొని మొత్తం రెండు లక్షల పోస్టల్ బ్యాలెట్లు జారీచేయగా, అందు లో ఇప్పటివరకు 32,331ఓట్లు పోలైన ట్టు వెల్లడించారు. వృద్ధులు, ఓటు వేసేందుకు వెళ్లలేనివారికి సంబంధించి ఎన్నికల సిబ్బంది వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఓట్లను సేకరిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, హోమ్ ఓటర్లకు ఓటు వేసేందుకు ఈనెల 8తుది గడువు.