ఆలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమానికి కేసీఆర్ కృషి
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
హన్మకొండ, ఏప్రిల్ 26 : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బ్రాహ్మణ సంఘాలు నాయకులు మద్దతు తెలిపారు. 66 డివిజన్లలో గులాబీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సమక్షంలో ప్రకటించారు. ఈమేరకు సోమవారం హన్మకొండలోని వినోద్కుమార్ నివాసంలో బ్రాహ్మణ సంఘాల నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.165 కోట్లు కేటాయించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. వేయిస్తంభాల గుడి వద్ద సుందరీకరణతో పాటు మెట్టుగుట్ట ఆలయాభివృద్ధికి రూ.5కోట్లు, భద్రకాళి ఆలయానికి రూ.3కోట్లు, పద్మాక్షి ఆలయం, వరంగల్లోని భోగేశ్వరాలయం, గోవిందరాజులగుట్ట, శివనగర్లోని నాగమయ్య గుడి అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి యాదాద్రి ఆలయమే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.
అలాగే 21 కులాల అర్చక వ్యవస్థను కాపాడేందుకు 577 జీవో ప్రకారం 5,625 మంది అర్చక ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తున్నట్లు వివరించారు. వరంగల్లో పనిచేస్తున్న 200 మందికి గతంలో రూ.5వేలు, రూ.10వేలు ఉండగా తెలంగాణ ప్రభుత్వం రూ.50వేల వరకు వేతనాలు పెంచినట్లు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు బ్రాహ్మణ భవన్కు ఎకరా స్థలం విషయమై సీఎంతో మాట్లాడి ఒప్పిస్తానని వినోద్కుమార్ హామీ ఇచ్చారు. టిక్కెట్ల కేటాయింపులో బ్రాహ్మణులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, వారికి తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామన్నారు. సమావేశంలో మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు, టీఆర్ఎస్ నేత గుడిమల్ల రవికుమార్, బ్రాహ్మణ సంఘాల నాయకులు గంగు ఉపేంద్రశర్మ, వెన్నంపల్లి జగన్మోహన్శర్మ, మోతుకూరి రామేశ్వర్రావు, ఐనవోలు ప్రవీణ్శర్మ, వల్లూరి పవన్కుమార్, జీవీఎస్ శ్రీనివాసచారి, దేవులపల్లి వాణి, కలకుంట్ల రఘునాథాచార్యులు, శరపురం రామలింగారాధ్య, తనుగుల అనిల్కుమార్, శేషభట్టర్ మాధవి, కలకోట కవితి, ఎస్బి. వేణుగోపాలాచార్యులు, గుడిమల్ల విజయ్కుమారాచార్యులు, చిదురాల నరేశ్, చెరుకుపల్లి నర్సింహాచార్యులు, కాసర్ల వసంత్తో పాటు 100 మంది వరకు బ్రాహ్మణులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కొవిడ్ వార్డును ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్
1 నుండి 9వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు