బీజేపీ సన్నాహక సభలో కుర్చీలు 300.. హాజరైంది 30
అవాక్కై, అసహనం వ్యక్తం చేసిన కేశవ్ ప్రసాద్ మౌర్య
గోల్నాక, జూలై 1: సాక్షాత్తు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న అంబర్పేట నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి దయనీయంగా మారింది. ఎంతలా అంటే ఆ పార్టీ కీలక నేత, యూపీ డిప్యూటీ సీఎం సభకు కనీసం జనాలు హాజరు కాలేనంతగా. 3న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని మోదీ సభకు జనాలను తరలించే ఏర్పాట్లలో భాగంగా గురువారం రాత్రి గోల్నాక డివిజన్లోని కరీమా ఫంక్షన్ హాల్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య హాజరయ్యారు. సభలో సుమారు 300 కుర్చీలు ఏర్పాటు చేయ 30 మంది మాత్రమే హాజరయ్యారు. 90 శాతం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇది చూసిన యూపీ డిప్యూటీ సీఎం అవాక్కయ్యారు. ఏ క్యా హై అంటూ అసహనం వ్యక్తం చేశారు.