మక్తల్ అర్బన్ ; నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పస్పుల గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో సోమవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన నర్సింహ వలకు 30 కిలోల భారీ చేప చిక్కింది. ఇది బొచ్చె రకం చేప అని, దీనికి మంచి ధర లభిస్తుందని ఆ జాలరి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ చేపతో జాలర్లు ఫొటోలు, సెల్ఫీలు తీసుకొని ఎంజాయ్ చేశారు.