హైదరాబాద్: నగర శివార్లలోని పటాన్చెరులో అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. పటాన్చెరు శివారులో రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ముజేందర్, శివ, అజిత్గా గుర్తించారు. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని, దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల మండలం అంతరాం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికిచేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానికుల సహాయంతో దవాఖానకు తరలించారు.