శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ప్రస్తుతం డ్యామ్లోకి 3,06,275 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. జూరాల స్పిల్వే నుంచి 1,17,323 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 35,989 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1,52,585 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి వస్తున్నది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 861.40 అడుగుల మేర నీరున్నది. గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 110.3410 టీఎంసీల నీరుందని అధికారులు తెలిపారు. ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా.. 25,427 క్యూసెక్కుల నీరు సాగర్కు వెళ్తున్నది.