శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 7: కాలు చెప్పు చాటున ఒకరు, వీపు మీద అతికించుకొని మరొకరు ఇలా వివిధ మార్గాల్లో అక్రమంగా బంగారం తరలిస్తున్న 10 మందిని శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం డీఆర్ఐ అధికారు లు పట్టుకున్నారు. వారి నుంచి మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు దుబా య్ నుంచి వచ్చిన అనుమానిత ప్రయాణికులను సోదా చేయగా ఈ బంగారం లభించినట్టు అధికారులు వెల్లడించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.