హైదరాబాద్ : రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సునీల్దత్(2014 బ్యాచ్)ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ వినీత్(2017 బ్యాచ్)ను కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. గ్రేహౌండ్స్ అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న బిరుదరాజు రోహిత్రాజు(2018 బ్యాచ్)ను భద్రాచలం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు.