హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొన్నది. ఉపరితల ఆవర్తనం కారణంగా 30 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నదని చెప్పింది. అక్టోబర్ 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు, జల్లులు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. కొత్తగూడెం, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, భువనగిరి, హనుమకొండ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో సైతం వర్షం కురుస్తుందని వెల్లడించింది.