హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్లో నమోదైన 3 కేసులను హైకోర్టు కొట్టివేసింది. నకిరేకల్లో పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయిందని, మాస్ కాపీయింగ్ నిందితులతో తనకు సంబంధాలు ఉన్నాయని సోషల్ మీడియాలో కేటీఆర్ నిరాధార ప్రచారం చేశారని నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ రజిత, మరో ఇద్దరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేటీఆర్తోపాటు క్రిశాంక్, కొణతం దిలీప్పై మార్చి 25న ఈ కేసులు నమోదు చేశారు. వా టిని కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టారు. ఒకే అంశంపై ఒకే పీఎస్లో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ 3 కేసులను కొట్టివేశారు.