హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.35 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేయడం పూర్తి చేశామని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్రాల్లో 2.9కోట్ల మంది, ప్రైవేటులో 38లక్షల మంది వ్యాక్సిన్లు తీసుకున్నట్లు వారు తెలిపారు. 2.31 కోట్ల మంది మొదటి డోసు తీసుకోగా, 1.03 కోట్ల మంది రెండో డోసు తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో హెల్త్ కేర్ వర్కర్లు 3లక్షల 7368 మంది మొదటి డోసు తీసుకోగా 2లక్షల 56 616 మంది రెండో డోసు తీసుకున్నారని వివరించారు.
ఫ్రంట్లైన్ వారియర్లు 3లక్షల 18వేల 506 మంది మొదటి డోసు, 2లక్షల 67 వేల 646 మంది రెండో డోసు తీసుకున్నారని వెల్లడించారు. 18-44 సంవత్సరాల వయస్సుగల కోటి 35లక్షల 21వేల57 మంది మొదటి డోసు, 49లక్షల 67,219 మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని వివరించారు. 45 ఏండ్లు పైబడిన వారు 90లక్షల 14,793 మంది మొదటి, 49లక్షల 7021 మంది రెండో డోసు తీసుకున్నవారిలో ఉన్నారని పేర్కొన్నారు. రెండో డోసు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పుడే కరోనాను ఎదుర్కొనే శక్తి లభిస్తుందని వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.