హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు సత్తాచాటారు. 295 మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు టెమ్రిస్ కార్యదర్శి షఫియుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో 206 మంది బాలురు, 89 మంది బాలికలు ఉన్నారు. టీఎస్ పాలిసెట్లో 779 మంది అర్హత సాధించగా.. వీరిలో 19 మంది బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందినట్టు తెలిపారు. ఈ ఏడాది 204 మైనార్టీ స్కూళ్లను కాలేజీలుగా అప్గ్రేడ్ చేశామని, వీటిలో సీఏ, సీపీటీ, లాసెట్, ఎంసెట్, ఐఐటీ, నీట్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.