హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపుల ద్వారా ఆదివారం ఒక్కరోజే 53,831 దరఖాస్తులు స్వీకరించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. వీటిలో కొత్తగా ఓటు హక్కు కోసం 28,037 దరఖాస్తులు, ఓటు తొలగింపునకు 9,665, ఓటు చిరునామా మార్పునకు 16,129 దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు. ఈఆర్వోలు 2,698 పోలింగ్ కేంద్రాలను, ఏఈఆర్వోలు 10,167 పోలింగ్ కేంద్రాలను సందర్శించినట్టు తెలిపారు. 35,356 పోలింగ్ కేంద్రాల్లో 11 మంది బూత్ స్థాయి అధికారులు హాజరుకాలేదని గుర్తించారు. వీరి నుంచి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. శని, ఆదివారాల్లో మొత్తం 97,616 దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు.