women’s day | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన మొత్తం 27 మందిని ఎంపికచేస్తూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పురస్కారాలకు ఎంపికైనవారికి ప్రభుత్వం రూ.లక్ష నగదు, జ్ఞాపిక అందజేయనున్నది. కాగా, పురస్కారాలకు ఎంపికైనవారికి రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతీ రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆల్ఫి కిడన్జెన్, సోషల్ సర్వీస్
సుజాత దీక్షిత్, థియేటర్ ఆర్ట్స్
డాక్టర్ అమూల్య మల్లన్నగారి, వైద్యం
ఓఎన్ఐ సిస్టర్స్
(వినోద, విజయ, విజయలక్ష్మి), సంగీతం
సమంతారెడ్డి, మహిళా పారిశ్రామికవేత్త
కర్నె శంకరమ్మ, కిన్నెర వాయిద్యం
సామల శ్వేత, కమ్యూనిటీ మొబిలైజేషన్
ఎం కృష్ణవేణి , ఆశా కార్యకర్త
ఇందిర, ఏఎన్ఎం